Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు మరోసారి విచారణస్పీకర్ ముందు వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు మరోసారి విచారణస్పీకర్ ముందు వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు

హైదరాబాద్‌, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 24

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రక్రియలో భాగంగా స్పీకర్ నేడు మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా, ఈ రోజు నాలుగు కేసులపై విచారణ జరగనుంది.ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ. ప్రకాష్ గౌడ్ కేసు విచారణ మొదలుకానుంది.మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య,మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి,మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసులపై విచారణలు జరగనున్నాయి.ప్రతి కేసులో ఇరు వర్గాల నుంచి న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఫిరాయింపు కేసులపై తుది నిర్ణయానికి చేరుకోవడంపై ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments