డైనమిక్,వరంగల్, నవంబర్ 06
వరంగల్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారంగా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల భూమిలో రూ.20 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కూడిన 5 అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించనున్నారు.
600 కార్లకు స్థానం
ఈ పార్కింగ్ కాంప్లెక్స్లో ఒకేసారి సుమారు 600 కార్లు నిలిపే సౌకర్యం కల్పించనున్నారు. వరంగల్ నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉండటంతో, ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర రవాణా వ్యవస్థకు బాగా ఊరట కలగనుంది.
హైదరాబాద్ నమూనాలో ప్రాజెక్టు
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఇప్పటికే ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ విజయవంతంగా పనిచేస్తోంది. అదే నమూనాలో వరంగల్లో కూడా ఈ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.
కేడీఏ ఆధ్వర్యంలో పనులు
ఈ ప్రాజెక్టును కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) పర్యవేక్షిస్తోంది. అవసరమైన డిజైన్లు, టెండర్ ప్రక్రియలు పూర్తి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
