నేరేడుచర్ల, ఫిబ్రవరి 4 , డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చెన్నబోయిన నాగరాజు ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎన్నికల చట్టాలు, ఖర్చుల నియంత్రణపై వివరణ
ఈ సదస్సులో 15 వార్డులకు చెందిన 54 మంది అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, ప్రచార విధానం, ఖర్చుల పరిమితులు, ఖాతాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు వివరించారు.
అధికారుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్. సైదులు, ఎస్ఐ రవీందర్, మాస్టర్ ట్రైనర్ ఎం. సందీప్ కుమార్, అసిస్టెంట్ ఎక్సెండీచర్ ఆబ్సర్వర్ కె. పద్మజ, అకౌంటింగ్ టీం సభ్యుడు టి. శ్రీనివాస్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అభ్యర్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు సూచించారు.
