డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, మార్చి 27
హుజూర్నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నుంచి చింతల బజారు మీదుగా మేళ్లచెరువు వెళ్లే బైపాస్ మార్గం (గాడిదల బాట)లో ఉన్న కాలువ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెన అంచున రోడ్డు కుంగిపోవడంతో లోతైన గుంత ఏర్పడింది.
వంతెన స్థితిపై ఆందోళన
వంతెన పక్కన మట్టి కోతకు గురై కాంక్రీట్ దిమ్మెలు బయటపడుతున్నాయి. నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో వంతెన కుప్పకూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళల్లో ప్రమాదాలు
రాత్రి వేళల్లో గుంత స్పష్టంగా కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు
ఏదైనా అపశృతి జరగకముందే హుజూర్నగర్ ఆర్ & బి అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన గుంతను పూడ్చి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
