అమరావతి,డైనమిక్ , అక్టోబర్ 27

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువును పొడిగించింది. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక, ఆలస్యంగా ఫీజు చెల్లించేవారికి రూ.1,000 జరిమానాతో వచ్చే నెల 6వ తేదీ వరకు అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు.ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సాధారణ, వృత్తిపర విద్యార్థులు నిర్ణీత గడువులోపే ఫీజులు చెల్లించాలని అధికారులు సూచించారు.
