Tuesday, January 13, 2026
Homeతాజా సమాచారందొంగతనాల నివారణకు జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ అలవాటైన నేరస్తులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

దొంగతనాల నివారణకు జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ అలవాటైన నేరస్తులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కఠిన హెచ్చరిక

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 7

జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీల వంటి నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అలవాటైన నేరస్తులకు కౌన్సిలింగ్

జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.

ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్

జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు ఎస్పీ వివరించారు. తరచూ నేరాలకు పాల్పడే నిందితులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

కఠిన చట్టాలు అమలు తప్పదు

నేరాలకు పాల్పడుతున్న వారు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (PD Act), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవడం తప్పదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. అవసరమైతే అరెస్టులు, రిమాండ్ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు.

నేర ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు

దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

ప్రజల సహకారం అవసరం

ప్రజలు తమ ఇళ్ల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉంచాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

నేరాలపై జీరో టాలరెన్స్

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు మళ్లితే, వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ–సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments