డైనమిక్ న్యూస్ ,నేరేడు చర్ల, డిసెంబర్ 10
నేరేడు చర్ల మండల పరిధిలోని మూడు గ్రామపంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఫతేపురం గ్రామంతో పాటు బూర్గుల తండా, పులగంబండ తండాలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఫతేపురం సర్పంచ్గా ఎదుల సుజాత (సోమిరెడ్డి)
ఫతేపురం గ్రామంలో సర్పంచ్ పదవికి ఎదుల సుజాత (సోమిరెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థుల మద్దతుతో ఆమెపై ఎవరూ పోటీకి దిగకపోవడంతో, ఎన్నికల అధికారులు ఆమెను సర్పంచ్గా ప్రకటించారు.
బూర్గుల తండా సర్పంచ్గా మాలోతు నాగు నాయక్
బూర్గుల తండా గ్రామపంచాయతీలో మాలోతు నాగు నాయక్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో సమ్మతి వాతావరణంతో నామినేషన్ల అనంతరం ఆయన విజయం ఖరారైంది.
పులగంబండ తండా సర్పంచ్గా బానోతు మంగ కోటి నాయక్
పులగంబండ తండాలో సర్పంచ్ పదవికి బానోతు మంగ కోటి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానికుల ఏకాభిప్రాయంతో ఆయనపై ఎటువంటి పోటీ లేకుండా విజయం సాధించారు.
గ్రామాల్లో సంబరాలు
ఈ మూడు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులలో హర్షం వ్యక్తమైంది. పూలమాలలు వేసి, శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామాలలో సంబరాలు నిర్వహించారు.


