డైనమిక్ న్యూస్ , డిసెంబర్ 3,పెద్ద శంకరంపేట
జీవిత బీమా సంస్థలో 25సంవత్సరాలుగా ఏజెంట్ ఉంటూ ఎండి ఆర్టి 26 యూఎస్ఏ మొదటిసారిగా 100 పాలసీలతో శతక వీరుడు మరియు తన సొంత గ్రామం నైన విరోజిపల్లి శంకరంపేట మండలంలో ఎల్ఐసి భీమా గ్రామంగా తీర్చి దిద్దడం జరిగింది ఈ మూడు ఖతలు ఒకేసారి సాధించి ఎంతోమంది ఏజెంట్లకు ఆదర్శంగా నిలిచడం జరిగింది ఈ సందర్భంగా సంగారెడ్డి శాఖ మేనేజర్ మాంకాల బాలరాజ్ మరియు వికాస్ అధికారి నాగార్జున రావు ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది. అందరూ ఉద్యోగులు ఏజెంట్లు ఖాతాదారుల సమక్షంలో అతనికి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంలో మేనేజర్ మాంకాల బాలరాజ్ మాట్లాడుతూ బి రవీందర్ యొక్క అనతి కాలంలో ఈ మూడు ఘనతలు సాధించడం చాలా సంతోషకరమని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవోలు సౌమ్య, రఘునందన్, గీత, బిమా సంస్థ ఉద్యోగులు సంఘం నాయకులు సతీష్ ,రాజారాంరెడ్డి ,ప్రభాకర్ లక్ష్మణ్ ,అరవింద్, అర్చన, నమిత మౌనిక, సుమ, లావణ్య ,సాయి జ్యోతి, ఏజెంట్లు రత్నమాల , బోయినీ సత్యం,శ్రీకాంత్, దత్తు, మున్నూరు శ్రీహరి, తదితరులు పాల్గొనడం జరిగింది
