నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 30
నల్లగొండ పట్టణంలోని లయన్స్ క్లబ్లో శనివారం నిర్వహించిన ప్రజా నిరసన సభలో సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో నిరపరాధుల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య హక్కులపై దాడి – నేతల విమర్శ
కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు దమన చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, దమన విధానాలను తక్షణమే విరమించి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
మహిళా, విద్యార్థి సంఘాల మద్దతు
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ, మహిళలు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను నిలిపేయాలని కోరారు. గంజి మురళీ, అవుట రవీందర్ మాట్లాడుతూ ప్రజల ఉద్యమాలను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మం పాటి శంకర్ మాట్లాడుతూ విద్యార్థి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు అవసరమన్నారు. బోల్లు రవీందర్, గంజి రాజేష్, ఆవుల అనురాధ తదితరులు సభలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఆపరేషన్ ‘కగార్’ తక్షణమే నిలిపివేయాలి
బూటకపు ఎన్కౌంటర్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి,బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
