Wednesday, January 14, 2026

ఈ నెల 18 న నిర్వహించే బీసీల బంద్ విజయవంతం చేయండి.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్.

కోదాడ,16 అక్టోబర్, డైనమిక్

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు లో స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18 న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ అన్నారు.పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వెంకన్న గౌడ్ మాట్లాడుతూ
బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, కోర్ట్ లలో క్లియర్ చేసిన తర్వాతనే నిర్వహించాలి అని, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక, కులగణన లెక్క తీసిన తర్వాత మా జనాభా 56 శాతం ఉంటే కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన కూడా కొంత మంది ఓర్వలేక పోతున్నారు అని అన్నారు. మేము ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీ మంత్రి పదవి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు, అడుగుతున్నామా అని, కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్ లు మాకు ఇస్తుంటే ఓర్వకుండా కోర్ట్ లలో కేసులు వేసి మా నోటీకాడి ముద్దను లాగివేస్తున్నారు అని అన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఇస్తే మేమేమైన అడ్డుపడ్డమా అని ప్రశ్నించారు. జీఓ నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మారిజర్వేషన్ల జోలికి ఎవ్వరు రావొద్దని,42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 18 న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ లో అందరూ పాల్గొని, ఈ బంద్ కి విద్య సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆర్టీసీ, సకల జనులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐతగొని జనార్దన్,
జాతీయ నాయకులు సిరికొండ శ్రీనివాస్, మేకల లక్ష్మయ్య, సత్యనారాయణ యాదవ్, కాశయ్య గౌడ్, నాగేశ్వరరావు, కృష్ణ యాదవ్, రమేష్ గౌడ్,
రవీందర్ మాదిగ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments