డైనమిక్,కారంపూడి, నవంబర్ 1
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మేల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డీ ఆదేశాల మేరకు శనివారం కారంపూడి మండల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మండలవ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
కారంపూడి పట్టణంతో పాటు కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదేవారిపల్లి, బట్టువారిపల్లి, చినకోదమగుండ్ల, పెదకోదమగుండ్ల గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి అర్హుడికి పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేశారు.
ప్రజల్లో ఆనందం – సీఎం చంద్రబాబు నాయకత్వానికి ప్రశంసలు
పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పథకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.
ప్రతి అర్హుడి ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ లక్ష్యం
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి వృద్ధుడు, వికలాంగుడు, విధవకు ఇంటి వద్దకే పింఛన్ అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని అధికారులు పునరుద్ఘాటించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.


ఈ కార్యక్రమంలో
ఎంపీడీవో, పార్టీ నాయకుల పాల్గొనడం
కార్యక్రమంలో ఎంపీడీవో గంటా శ్రీనివాస్ రెడ్డి ,సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్ల సురేష్, పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు తండా మస్తాన్ జాని, యూనిట్ ఇంఛార్జ్ మీరవలీ తదితరులు పాల్గొన్నారు.
